దేశంలోని అనేకమంది తల్లులు, సోదరీమణులకు ఉజ్వల యోజనతో ఎంతో ప్రయోజనం చేకూరడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
దేశంలోని తల్లులు, సోదరీమణులకు ఈ పథకంతో ఒనగూడిన లబ్ధిపై రూపొందించిన వీడియోను ప్రజలతో పంచుకుంటూ ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఉజ్వల’ పథకం మన పేద తల్లులు, సోదరీమణుల జీవన సౌలభ్యం కల్పించి, దైనందిన జీవితం ఆనందంతో ప్రకాశింపజేయడం ఎంతో ఆనందదాయకం” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.